Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 13, 2026Short Read
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.
ఈ నెల 17న ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరుకాకూడదని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో తీర్మానించారు.
అయితే, శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరుకావాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ పార్టీ సభ్యులకు సూచించారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమకు ఆ హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.





